---Advertisement---

Microsoft Outrage : మైక్రో సాఫ్ట్ లో ఎర్రర్ కి అసలు కారణం ఇదే !

ఒక్క రోజు ప్రపంచం మొత్తానికి మైక్రోసాఫ్ట్ చుక్కలు చూయించింది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న పీసీలు, ల్యాప్ టాప్స్ అన్నీ మొరాయించాయి. వాటిల్లో ఒక్కసారిగా బ్లూ స్క్రీన్ రావడంతో ప్రపచంలో దాదాపు అన్ని సేవలకు అంతరాయం కలిగింది. విమానం, బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్లు, మీడియా, హాస్పిటల్స్ ఇలా… ప్రతి రంగంపైనా ఈ ప్రభావం పడింది. అమెరికా, ఆస్ట్రేలియా, భారత్ లాంటి దేశాల్లో పెద్ద ఎత్తున సేవా, వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోవడంతో తీవ్ర నష్టం జరిగింది. కోట్ల మంది జనం ఇబ్బందులు పడ్డారు.
మైక్రోసాఫ్ట్ ఎర్రర్ స్క్రీన్ పై రావడం చూసి… ఎవరైనా హ్యాకర్లు వైరస్ తో ఎటాక్ చేశారా అని చాలా మంది భయపడ్డారు. అయితే సైబర్ సెక్యూరిటీ సంస్థ… క్రౌడ్ స్ట్రైక్ అందించిన అప్ డేట్ లో బగ్ ఉండటం వల్ల సిస్టమ్స్ ఆగిపోయినట్టు తేలింది. ఆ సమస్యను గుర్తించి సాల్వ్ చేయడంతో మళ్ళీ కంప్యూటర్లు పని చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా విండోస్ OS వాడే డెస్క్ టాప్ లు, ల్యాప్ టాప్ లు 73శాతం దాకా ఉన్నాయి. అందుకే ఈ ప్రభావం ఎక్కువ సిస్టమ్స్ మీద పడింది.

ఏంటి క్రౌడ్ స్ట్రైక్… అసలు ఎందుకు వచ్చింది

ఈ డౌట్ చాలామందికి వచ్చింది. మైక్రో సాఫ్ట్ సహా చాలా పెద్ద పెద్ద సంస్థలు … హ్యాకర్లు, సైబర్ దాడుల నుంచి రక్షించుకోడానికి క్రౌడ్ స్ట్రైక్ అనే క్లౌడ్ ఆధారిత సైబర్ సెక్యూరిటీ సంస్థ అభివృద్ధి చేసిన సాఫ్ట్ వేర్ ను వాడుతున్నాయి. ఆ సంస్థ రీసెంట్ గా ఇచ్చిన అప్ డేట్ లో ఓ బగ్ ఉంది. దాంతో విండోస్ వాడే కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఎర్రర్ వచ్చి… లూప్ లో రీస్టార్ట్ అవడం మొదలుపెట్టాయి. 2011లో అమెరికాలోని టెక్సాస్ లో క్రౌడ్ స్ట్రైక్ సంస్థ ప్రారంభమైంది. 2013 నుంచి యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ ను మార్కెట్లోకి రిలీజ్ చేస్తోంది. మైక్రో సాఫ్ట్ కూడా తన విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ లో క్రౌడ్ స్ట్రైక్ ను వాడుతోంది… ఇది సాధారణ యాంటీ వైరస్ ల కన్నా… చాలా పవర్ ఫుల్ గా వర్క్ చేస్తుంది. కానీ ఓ చిన్న బగ్ సృష్టించిన సంక్షోభంతో జులై 19 ఇంటర్నెట్ ప్రపంచంలోనే చీకటి రోజుగా మిగిలిందని అంటున్నారు సైబర్ నిపుణులు.

 

---Advertisement---

Related Post

---Advertisement---

LATEST Post

error: Content is protected !!