తెలంగాణలో గ్రూప్ 1 సర్వీసులకు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష నుంచి మెయిన్స్ కు 1;50 నిష్పత్తిలోనే అభ్యర్థులను ఎంపిక చేస్తామని TGPSC ప్రకటించింది. సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన జీవో నెంబ. 55,59 నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని ప్రకటించింది. నిరుద్యోగ అభ్యర్థలను పరిశీలించామనీ… కానీ 1:100 ఎంపిక సాధ్యం కాదని స్పష్టం చేసింది.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం వారి అభ్యర్థనలను పరిశీలించి వీలైనంత త్వరగా కమిషన్ నిర్ణయం తీసుకోవాలని, ఆ నిర్ణయాన్ని అభ్యర్థులకు తెలియజేయాలని ఆదేశించింది. దాంతో అభ్యర్థనలను తిరస్కరిస్తున్నట్లు కమిషన్ తెలిపింది.
తిరస్కరణ ఎందుకంటే.
- TGPSC Group.1 ఉద్యోగ ప్రకటన 2024 ఫిబ్రవరి 19న జారీ చేసింది. ప్రిలిమినరీ పరీక్ష జూన్ 9న నిర్వహించింది. ప్రధాన పరీక్షకు మల్టీజోన్ 1, 2 వారీగా 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని కోరుతూ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.
- సాధారణ పరిపాలనశాఖ జారీ చేసిన జీవో నం.55 (తేదీ 25/04/2022). దీన్ని సవరణ చేస్తూ జారీ చేసిన జీవో నం. 29కి లోబడి గ్రూప్-1 మెయిన్స్ కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ఉద్యోగ ప్రకటనలో స్పష్టంగా పేర్కొన్నారు.
- 1.50 నిష్పత్తిలో ఎంపిక విషయం జీవోలోని పేరా నం.5లో స్పష్టంగా ఉంది. ప్రతి మల్టీజోన్లో ఉద్యోగాల సంఖ్య ఆధారంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్ధుల ఎంపిక ఉంటుంని ప్రకటనలో తెలిపింది.
తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్ సర్వీసు నిబం ధనలు-1996లోని 22, 22ఏ ప్రకారం సంబంధిత రిజర్వుడ్ కేటగిరీల్లో అభ్యర్థుల సంఖ్య తక్కువైతే, అందుకు తగ్గట్టుగా ఆ కేటగిరీల నుంచి అదనంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. - మెయిన్ కు అభ్యర్థుల ఎంపికపై ఉద్యోగ ప్రకటన నం. 02/2024లోని పేజీ నం.16లోని పేరా 12 లోని పేరా బీ లోనూ 1:50 నిష్పత్తిన స్పష్టంగా తెలిపింది.
ప్రభుత్వ ఉత్తర్వులు, నిబంధనలకు లోబడి కమిషన్ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రకటనలను వెల్లడించి పోస్టులను భర్తీ చేస్తుంది. అందువల్ల అభ్యర్థుల రిక్వెస్ట్ ను పరిశీలించి వాటిని తిరస్కరిస్తున్నట్లు TGPSC తెలిపింది.
Post Views: 252